Posts

బొండు మల్లెలు

ఈ చిన్న కథ ప్రపంచాన్ని చూసే నా దృక్పథం ని పూర్తి గా మార్చేసింది..                                   షార్ట్ గా స్టోరీ చెప్తే… మల్లె పూలు కి మార్కెట్ లో మంచి రేటు ఉంది అని రచయత , ఖాళీ గా ఉన్న తన ఇంటి పెరడు లో ఈ పూలు పెంచితే మంచి లాభం వస్తుంది అనుకుంటాడు… ఎలాగూ డబ్బు ఉన్న వాళ్ళే ఈ మల్లె పూలు కొంటారు కాబట్టి వాళ్ళకి ఈ మల్లె పూలు ఎక్కువ రేట్ కి అమ్మినా, వాళ్ళని ఇలా దోపిడీ చేసినా పెద్ద అన్యాయం ఏం కాదు అనుకుంటాడు… కానీ గోతులు తీయటానికి ఓ మనిషి అవసరం పడితే, పని ఉందా బాబు అనుకుంటూ పొట్ట వెన్నుకు అంటుకుపోయిన ఓ తాత ఎదురు వస్తాడు… తమకి తోసింది ఇయ్యిండి బాబు అనగానే , తాత అవసరం లో తనకి ఓ అవకాశం కనపడి.. చాలా తక్కువ కి బేరం ఆడతాడు…   పని అవసరం కాబట్టి తాత కూడా మారు మాట్లాడకుండా చిత్తం బాబూ ! కానీ మధ్యాన్నం కాసిన్ని గంజి నీళ్ళు పోయమంటాడు… ఎలాగూ తక్కువ కే పనికి కుదిరాడు అని సరేలే అని రచయత ఒప్పుకుంటాడు… చివరలో పేచీ ఏమైనా పెడతాడు ఏమో అని అనుకున్నా..పని ఐపోయాక ఇచ్చినంత తీసుకుని తాత వెళ్ళిపోతాడు… కానీ మళ్...

శరీరం - ఆత్మ

అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా? వాస్తవానికి శరీరం ఆత్మ  రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం.. మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. కానీ... ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది.        ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే... శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు.     బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో... శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా... ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి... తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.      పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్న...

శాంతి

Image
శాంతి కావాలంటే నాణ్యమైన మనిషి తయారవ్వాలి, నాణ్యమైన వస్తువు కాదు... ఇది  శాస్త్రీయ సత్యం... సశాస్త్రీయమైన  సనాతన భారతీయ బ్రహ్మవిద్యా క్రియాయోగం సాధన ద్వారా అనంతకాలంనుండీ భారతంలో నిరూపితమైన సత్యం... ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలుగానే ప్రపంచంలోని వారంతా మనిషి నాణ్యతని పణంగా పెట్టి, మనిషి నాణ్యతని కాలరాసేసి...ఎంతో  నాణ్యమైన, ఖరీదైన  వస్తువులు చేస్తున్నారు... మొత్తం నాణ్యతలేని మనుషులందరూ కలిసి.. మరి వీళ్ళంతా శాంతిని పొందలేదు???? పైగా మరింత అశాంతి, అసహనంగా, అసూయ, హింసాయుత జ్వాలల్లో రగిలిపోతున్నారు..!!!!???? ప్రపంచాన్ని ఒక కాబట్టి నాణ్యమైన మనిషిగా తయారవాలి, భగవత్ సాధనాయుతమైన మన శాశ్వతమైన సనాతనమైన చావు పుట్టుకలకు అతీతమైన బ్రహ్మ విద్యా క్రియాయోగం విద్య యొక్క  కృపతో...!!! ఈ నాణ్యమైన మనిషిని తయారుచేసే విద్యనే  శ్రీ స్వామివారు పరబ్రహ్మ శ్రీ శ్యామాచరణ లాహిరీ మహాశయుల వారు తిరిగి గృహస్థుల కోసం సమాజంలోకి తిరిగి తీసుకొచ్చారు. .. తానూ మనలోనే మనలానే పుట్టి, మనలానే సంసారిగా సుఖదుఃఖాలు అనుభవించి తను చేసి చూపించిన విద్యనే  మనకి ప్రసాదించి వెళ్ళారు... సనాతన భారతీయ బ్రహ్మవిద్...